నా మొదటి పద్యం



ది నా మొదటి పద్యం. అమ్మవారిని స్తుతిస్తూ వ్రాశాను. పద్య నిర్మాణంలో సందేహ నివృత్తి చేసిన శంకరాభరణం బ్లాగు నిర్వాహకులు, గురుతుల్యులు శ్రీ కంది శంకరయ్య గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

ఇది సీస పద్యం. తేటగీతితో పద్యాన్ని పూర్తిచేశాను. రెఫరెన్స్ కోసం వాటి వాటి లక్షణాలు క్రింద పొందుపరచాను.

సీసము - లక్షణాలు

నాలుగు పెద్ద పాదాలు . ప్రతి పాదానికి 6 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు. 4+ 4 గణాలుగా పాదం వ్రాస్తే ప్రతి పాదంలోనూ మూడవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతికి బదులు ప్రాసయతిని వాడవచ్చు. అన్ని పాదాల్లోనూ ఒకే యతి పాటించాలనీ లేదు, పాటించకూడదనీ లేదు. మొత్తం పద్యానికీ ఒకే యతి పాటించవచ్చు. ప్రాస నిమయం లేదు. అక్షర నియతి లేదు. సీస పద్యాన్ని ఆటవెలదితో కానీ తేటగీతితో కానీ తప్పనిసరిగా పూర్తిచెయ్యాలి.

తేటగీతి - లక్షణాలు

1 సూర్య గణం + 2 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు. 5 గణాలు ఏ పాదానికా పాదంగా ఉంటాయి. ప్రతి పాదంలోనూ నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. వీలైతే ప్రాసయతి వాడవచ్చు. ప్రాస నియమం లేదు. అక్షర నియతి లేదు.

నా పద్యం

శ్రీకరి సుందరి శ్రీవిష్ణు హృత్పద్మ
                మందిరా ఇందిర మంగళప్రియ
దాక్షాయణీ దుర్గి దైత్యసంహారిని
               
దీనసంసేవిని దేవదేవి
జ్ఞానసంజీవని నాదసంధాయని
               
శారదా సర్వజ్ఞ త్యరూప
 
ఓంకార రూపిణీ జస్స్వరూపిణి
                
ర్వలోకాత్మికా ర్వమాత 

మల భావాంతరంగిణి న్నపూర్ణ
విశ్వరూపిణి త్రినయని వేద వినుత
యోగమాయా వినోదిని త్పలాక్షి
పాహి మోక్షప్రదాయిని పాహి పాహి


 
భావం :

ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లీ, సుందరి ,శ్రీ మహావిష్ణువు హృదయపద్మమందిరంలో వసించు లక్ష్మీ, మంగళప్రియ, దాక్షాయని, దుర్గా (పార్వతి),దైత్య సంహారిని,దీనజన సంరక్షిణి, దేవ దేవి, జ్ఞానమనే సంజీవని ప్రసాదించి అజ్ఞానమనే మృత్యువు నుంచి రక్షించు సరస్వతి, నాదంతో (సంగీతంతో) అనుసంధానింపబడు శారదా,(సంగీతానికి సాహిత్యానికి నెలవు సరస్వతి, శరదృతువులో సరస్వతిని పూజిస్తారు), సర్వజ్ఞురాలా , సత్య రూపిణి, ఓంకార రూపిణి, ఓజస్స్వరూపిణి (ఓజస్సు = తేజము, బలము, ఉత్సాహము), సర్వలోకాత్మికా, సర్వమాత, నిర్మల(అమల=నిర్మల) హృదయాంతరంగముతో విశ్వాన్ని పోషించే అన్నపూర్ణ, విశ్వరూపిణి, త్రినయన, వేదముల చేత స్తుతింపబడి, యోగమాయతో వినోదించు కలువకన్నుల తల్లీ, మోక్షప్రదాయినీ రక్షించు తల్లీ రక్షించు .    


6 comments

Post a Comment